బాబు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో…?

రాజధాని భూముల వ్యవహారం, అసైన్డ్ భూముల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై విచారణ [more]

Update: 2021-03-20 01:08 GMT

రాజధాని భూముల వ్యవహారం, అసైన్డ్ భూముల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై విచారణ జరపకుండా నాలుగు వారాల పాటు ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఐడీ కేసు విచారణపై స్టే ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వంలోని పెద్దలు న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు.

Tags:    

Similar News