అమరావతి భూమి పూజకు నేటికి ఐదేళ్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూమి పూజ చేసి నేటికి ఐదేళ్లు అయింది. 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అమరావతిలో భూమి పూజ చేశారు. అమరావతికి [more]

Update: 2020-10-22 02:02 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూమి పూజ చేసి నేటికి ఐదేళ్లు అయింది. 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అమరావతిలో భూమి పూజ చేశారు. అమరావతికి భూమి పూజ చేసి ఐదేళ్లు కావస్తుండటంతో అమరావతి రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని భూమి పూజ చేసిన ప్రాంతానికి ప్రదర్శనగా వెళ్లి అక్కడ నిరసన తెలియజేయాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. అయితే పోలీసులు ఇందుకు అనుమతించలేదు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు నేడు నిరసనలు తెలియజేయనున్నారు.

Tags:    

Similar News