శ్రీవారి భక్తులకు IRCTC గుడ్‌న్యూస్.. వారికోసం స్పెషల్ ప్యాకేజీ !

తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నైకి, అక్కడి నుంచి తిరుపతికి చేరుకుంటారు. మార్గ..

Update: 2022-03-02 11:04 GMT

శ్రీవారి భక్తులకు IRCTC గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకోసం ఐఆర్ సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంటుంది. తాజాగా మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్ సీటీసీ. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో 'తిరుపతి దేవస్థానం' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. టూ డేస్, వన్ నైట్ ఉండే ఈ ప్యాకేజీ మార్చి 5,12,26 తేదీల్లో భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కూడా కవర్ అవుతాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా ఈ ప్యాకేజీలో కలిపి ఉంటుంది.

ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నైకి, అక్కడి నుంచి తిరుపతికి చేరుకుంటారు. మార్గమధ్యంలో శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి వెళ్లాక ఒక హోటల్ గదిని కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం రాత్రికి తిరుపతిలోనే బస. మర్నాడు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకువెళ్లి.. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేయిస్తారు. దర్శనానంతరం హెటల్ కు వెళ్లి.. అక్కడి నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లాలి. రాత్రి 7.45 గంటలకు చెన్నైలో విమానం ఎక్కితే 10.45 గంటలకు తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ప్యాకేజీలో ముగ్గురికైతే రూ.15,660, ఇద్దరికైతే రూ.15,800, ఒక్కరికైతే రూ.17,710 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీలను అందిస్తుండగా.. ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ప్యాకేజీని ప్రారంభించింది.





Tags:    

Similar News