భారత్ ఖాతాలో కివీస్ సిరీస్

న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ భారత్ వశమైంది. సోమవారం జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో ఇంకా రెండు మ్యాచ్ [more]

Update: 2019-01-28 09:50 GMT

న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ భారత్ వశమైంది. సోమవారం జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇవాళటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 243 పరుగులు చేసింది. తర్వాత చేజింగ్ కు దిగిన భారత్ 3 విక్కెట్లు మాత్రమే కోల్పోయి మరో ఏడు ఓవర్లు ఉండగానే 245 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ 62, శిఖర్ ధావన్ 28, విరాట్ కోహ్లీ 60 పరుగులు చేసి ఔటయ్యారు. ఇక అంబటి రాయుడు 40(నాటౌట్), దినేశ్ కార్తీక్ 38(నాటౌట్)గా నిలిచి భారత్ ను గెలిపించారు. ఇప్పటివరకు న్యూజిలాండ్ గడ్డపై భారత్ రెండు సిరీస్ లు మాత్రమే గెలిచింది. 2009లో ఒక సిరీస్ గెలవగా పదేళ్లకు భారత్ మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది.

Tags:    

Similar News