ఉద్యోగులకు గుడ్ న్యూస్

దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేేందుకు మరిన్ని ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. అందులో ప్రత్యక్ష్య పన్నులను కొన్నింటిపై వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. [more]

Update: 2020-02-01 07:43 GMT

దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేేందుకు మరిన్ని ప్రయత్నాలు మొదలు పెట్టామన్నారు. అందులో ప్రత్యక్ష్య పన్నులను కొన్నింటిపై వేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సేంజ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పన్నుల విధానాలను సరళీకృతం చేశామన్నారు. ఎల్ఐసీలో పాక్షికంగా ప్రభుత్వ వాటాను విక్రయిస్తున్నట్లు తెలిపారు. త్వరలో స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లోకి ఎల్ఐసీ చేరుతుంది. ఎల్ఐసీని ప్రయవేటీకరణ చేయడంలో భాగంగానే తొలుత వాటాలను కేంద్రం విక్రయించనుంది. బడ్జెట్ లో ఉద్యోగులకు పెద్ద యెత్తున ఆదాయపు పన్ను మినహాయింపును ఇచ్చారు. ఐదు లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉన్న వారు పదిశాతం మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 7.5 లక్షల నుంచి పది లక్షల వరకూ ఆదాయం ఉన్న వారు పదిహేను శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పది లక్షల నుంచి 12.5 లక్షల వరకూ ఆదాయం ఉన్న వారు 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఐదు లక్షల ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News