తెలుగు రాష్ట్రాల్లో కుబేరులు

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది.

Update: 2023-03-24 06:39 GMT

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది. సంపన్నులు జాబితా 2022 ను వెల్లడించింది. వీరంతా వెయ్యి కోట్ల ఆస్తికి పైగా ఉన్న వారు. వెయ్యి కోట్లకు మించి ఆస్తి ఉన్న 78 మంది తెలుగు రాష్ట్రాల్లో సంపన్నుల పేర్లను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే వీరి ఆస్తుల విలువ ఈ ఏడాడి మూడు శాతం పెరిగిందని కూడా తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

దివీస్ అగ్రస్థానం...

దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళీ దివితో పాటు ఆయన కుటుంబం 56,200 కోట్ల రూపాయలతో అత్యంత ధనిక కుటుంబంగా ప్రధమ స్థానంలో నిలిచింది. హెటిరో ల్యాబ్స్ కు చెందిన పార్థసారధి రెడ్డి ఫ్యామిలీ 39,200 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉన్నారు. మరో పారిశ్రామికవేత్త మహిమ దాట్ల 8,700 కోట్ల రూపాయలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా ఆమె గుర్తింపు పొందారని ఈ జాబితా వెల్లడించింది.

హైదరాబాదీలే...

అయితే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారే. మొత్తం 78 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకోగా అందులో 64 మంది హైదరాబాద్ కు చెందిన వారు. వీరిలో ఫార్మా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, భవన నిర్మాణ రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరితో పాటు విశాఖపట్నం నుంచి ఐదుగురు, రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి కొత్తగా తెలుగు రాష్ట్రాల నుంచి మరో 11 మంది స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటి ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఐఐఎఫ్ఎఫ్ వెల్త్ హురున్ ఇండియా ప్రకటించింది. 

పేరు                                           సంస్థ                                            కోట్లలో
మురళి దివి                            దివీస్ ల్యాబరేటరీస్                            56,200
బి.పార్థసారధి రెడ్డి                  హెటిరో ల్యాబ్స్                                   39,200
ఎం. సత్యనారాయణరెడ్డి         ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్                            16,000
జి. అమరేందర్ రెడ్డి                       జీఏఆర్                                       15,000
రామేశ్వరరావు జూపల్లి                     మైహోం                                   13,300
పి. పిచ్చిరెడ్డి                          మేఘా ఇంజినీరింగ్                              12,600
పీవీ కృష్ణారెడ్డి                         మేఘా ఇంజినీరింగ్                             12,100
కె.సతీష్ రెడ్డి                            డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్                          11,300
జాస్తి వెంకటేశ్వర్లు                    సువెన్ ఫార్మా                                       9,000
మహిమ దాట్ల                          బయోలాజికల్ ఇ                                  8.700


Tags:    

Similar News