వైఎస్ వివేకా హత్య కేసులో రికార్డులన్నీ?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు [more]

Update: 2020-11-12 02:01 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సంబంధింిచ రికార్డులు, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీబీఐకి అప్పగించాలని కడప జిల్లా మెజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది. తమకు రికార్డులు అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను కడప జిల్లా కోర్టు తిరస్కరించడంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.

Tags:    

Similar News