ఆ అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వైైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా వ్యాప్తికి కారణమయ్యారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. [more]

Update: 2020-05-05 07:22 GMT

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వైైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా వ్యాప్తికి కారణమయ్యారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లాక్ డౌన్ నిబంధనలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని పిటీషనర్ కోరారు. దీనిని విచారించిన హైకోర్టు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వారంలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా, కిలివేటి సంజీవయ్య, విడదల రజనీ, వెంకటగౌడలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరికి కరోనా టెస్ట్ లు చేశారా? లేదా? అని కూడా హైకోర్టు ప్రశ్నించింది.

Tags:    

Similar News