బాబుపై కొత్త తరహా కుట్ర

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మరోసారి కుట్రకు తెరలేపారని సినీనటుడు శివాజీ మరోసారి ఆరోపించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు [more]

Update: 2019-01-02 12:04 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మరోసారి కుట్రకు తెరలేపారని సినీనటుడు శివాజీ మరోసారి ఆరోపించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. చుక్కల భూములపై మంత్రులను అధికారులు పనిచేయడం లేదన్నారు. చుక్కల భూముల ఫైలును కొందరు అధికారులు కావాలని తొక్కిపెట్టారన్నారు. చుక్కల భూములపై సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే ఆమరణదీక్ష చేస్తానని ప్రకటించారు. చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందన్నారు. అంత ఇష్టముంటే అధికారులు రాజీనామా చేసి విపక్షంలో చేరాలన్నారు. జగన్ కు సీఎం కుర్చీకావాలి తప్ప సమస్యలు పట్టవన్నారు. మంత్రులను కూడా అధికారులు లెక్క చేయడం లేదన్నారు. ఉన్నతస్థాయి అధికారులే చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడగా మారిందన్నారు. తాను మీడియాను కలిసిన తర్వాతనే చంద్రబాబును కలుస్తానన్నారు. అన్ని ఆధారాలను చంద్రబాబుకు అందిస్తానన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోట పొడవడంలో చంద్రబాబు తప్పేమీ లేదన్నారు. నాడు పురాణాల్లో వాలిని చంపేందుకు రాముడు వ్యవహరించినట్లుగానే చంద్రబాబు ఆరోజు నడుచుకున్నారన్నారు. అది వెన్నుపోటు కాదని, అది వెన్నుదన్ను అని తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారన్నారు.

Tags:    

Similar News