మళ్లీ మొదటి నుంచి జరపాల్సిందే

రెండు ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ రాజ్యాంగ పరంగా పనిచేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక సంఘటనలు జరగకుండా [more]

Update: 2020-03-18 08:59 GMT

రెండు ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ రాజ్యాంగ పరంగా పనిచేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎన్నికల సందర్భంగా మళ్లీ హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం సరికాదని జీవీఎల్ వైసీపీకి సూచించారు. అలాగే తామేదో అధికారంలో ఉన్నప్పుడు అంతా మంచే చేశామని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందని జీవీఎల్ చెప్పారు. సుప్రీంతీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలపిరు. అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరును తామే కాకుండా, ప్రజలు తప్పుపట్టారన్నారు. ఎన్నికలను పూర్తిగా మొదటి నుంచి నిర్వహించాలని తాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను కోరమన్నారు.

Tags:    

Similar News