జగన్ దోచుకునే కుట్రలను ఆపు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జలవివాదాలకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరేనని ఆయన [more]

Update: 2021-06-27 05:41 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జలవివాదాలకు కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరేనని ఆయన అన్నారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఎక్కువ నీటిని దోచుకుపోవాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. దీనివల్ల మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారనున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కృష్ణా జలాల వివాదం తెచ్చారన్న బీజేపీ ఆరోపణలను గుత్తా సుఖేందర్ రెడ్డి కొట్టిపారేశారు.

Tags:    

Similar News