బ్రేకింగ్ : గవర్నర్ మరో డెడ్ లైన్

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూబాయి వాలా మరో డెడ్ లైన్ విధించారు. ఈరోజు సాయత్రం ఆరుగంటల్లోగా బల పరీక్ష జరగాలని గవర్నర్ కోరారు. మరోసారి ముఖ్యమంత్రి [more]

Update: 2019-07-19 10:45 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూబాయి వాలా మరో డెడ్ లైన్ విధించారు. ఈరోజు సాయత్రం ఆరుగంటల్లోగా బల పరీక్ష జరగాలని గవర్నర్ కోరారు. మరోసారి ముఖ్యమంత్రి కుమారస్వామికి మరోసారి లేఖ రాసిన గవర్నర్ సెకండ్ డెడ్ లైన్ ను విధించారు. తనకు ఎమ్మెల్యేలను కొనుగోలు జరుగుతున్నట్లు తనకు సమాచారం ఉందని, హార్స్ ట్రేడింగ్ జరగకుండా ఉండాలంటే వెంటనే బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. విశ్వాసపరీక్షపై చర్చను సుదీర్ఘంగా పొడిగించడం సరికాదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ కూడా విప్ పై తమకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టను కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది.

Tags:    

Similar News