మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

కరోనా వైరస్ టీఆర్ఎస్ నేతలను వదలిపెట్టడం లేదు. తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో గొంగిడి సునీత వైద్య పరీక్షలు [more]

Update: 2020-07-04 04:17 GMT

కరోనా వైరస్ టీఆర్ఎస్ నేతలను వదలిపెట్టడం లేదు. తాజాగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో గొంగిడి సునీత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, బిగాల గణేష్, మంత్రి మహమూద్ ఆలి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో కొందరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గొంగిడి సునీతకు పాజిటివ్ అని తేలడంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు.

Tags:    

Similar News