వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ : పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై రూ.150, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర బంగారం ధరలు పెరిగి.. రూ.47,900, రూ.52,250కి చేరాయి. అలాగే కిలో వెండి ధర రూ.400 మేర పెరిగింది.

Update: 2022-05-26 03:09 GMT

హైదరాబాద్ : పసిడి ప్రియులకు బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. నేడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధరపై రూ.150, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర బంగారం ధరలు పెరిగి.. రూ.47,900, రూ.52,250కి చేరాయి. అలాగే కిలో వెండి ధర రూ.400 మేర పెరిగింది.

దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళలలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,900కి పెరగగా, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,250కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.48,370, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,770గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.47,900గా ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.52,250గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో.. కిలో వెండి ధర రూ.62,000కి చేరింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.62,000 ఉండగా.. చెన్నై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.66,500 గా ఉంది.


Tags:    

Similar News