రేపటి నుంచి దుర్గగుడి ఫ్లై ఓవర్ పై రాకపోకలు

గడ్కరీకి కరోనా సోకడంతో దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం రేపటి నుంచి దుర్గగుడి ఫ్లై ఓవర్ మీద ప్రజలను అనుమతించాలని ప్రభుత్వం [more]

Update: 2020-09-17 07:04 GMT

గడ్కరీకి కరోనా సోకడంతో దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం రేపటి నుంచి దుర్గగుడి ఫ్లై ఓవర్ మీద ప్రజలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి రేపు దుర్గగుడి ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించాల్సి ఉంది. ఒకసారి ప్రారంభోత్సవం మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడింది. ఈసారి గడ్కరీకి కరోనా సోకడంతో ప్రారంభం కాకపోయినా దుర్గగుడి ఫ్లై ఓవర్ రాకపోకలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News