అగ్నికీలల్లో దీపిక అపార్ట్ మెంట్..!

Update: 2018-06-13 10:19 GMT

ముంబై లోని పార్శ్ ఏరియా అంటే బాలీవుడ్ నటులు, ప్రముఖ వ్యాపారులు ఉండే వార్ల ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల బి మౌంట్స్ టవర్స్‌ అగ్ని కీలల్లో చిక్కుంది. బి మౌంట్స్ టవర్స్ లోని 33వ అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అపార్ట్ మెంట్ లో భారీగా మంటలు ఎగిసిపడటంతో .. అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. అయితే ఎవరికీ ఏమి కాకుండా ఆ భవనంలో ఉన్న 95 మందిని ఫైర్ సిబంది కాపాడినట్లుగా తెలుస్తుంది.

ఫ్లాట్ లో లేని దీపిక...

అయితే బి మౌంట్స్ టవర్స్ లోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నివాసముంటుంది. ఆమె ఖరీదైన ప్లాట్ కూడా ఈ భవనంలోనే ఉంది. అయితే ప్రస్తుతం దీపికా పదుకొనె ఆమె ప్లాట్ లో లేదని తెలుస్తుంది. ఆ భవనానికి అగ్ని జ్వాలలు ఎలా కమ్ముకున్నాయి అనేది ఇంకా తెలియరాలేదు. అక్కడ భవనాన్ని చుట్టుముట్టిన అగ్ని కీలలని అగ్ని మాపక సిబ్బంద అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో.. అక్కడ సహాయ చర్యలకు కాస్త ఆటంకం ఏర్పడుతుందని సమాచారం అందుతుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 6 ఫైర్ ఇంజిన్లు సర్మిస్తున్నట్టుగా సమాచారం.

Similar News