కాంగ్రెస్ కు తలనొప్పిగా ఈటల వ్యవహారం

కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఈటల రాజేందర్ ను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ లోని కొందరు [more]

Update: 2021-05-14 00:53 GMT

కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్ వ్యవహారం తలనొప్పిగా మారింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఈటల రాజేందర్ ను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ లోని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే పోటీకి పెట్టకుండా ఈటల రాజేందర్ ను గెలిపించుకుని కేసీఆర్ ను దెబ్బతీయాలనుకుంటున్నారు. కానీ హుజూరాబాద్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారారు. ఆయన అన్ని చానళ్లు తిరుగుతూ ఈటల రాజేందర్ భూబాగోతాలను బయటపెడుతున్నారు. ఇది కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. కౌశిక్ రెడ్డిని కట్టడి చేయాలని కొందరు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Tags:    

Similar News