ఢిల్లీ వెళ్లి మాచర్లకు కరోనా తెచ్చారు

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 17న ఢిల్లీకి వెళ్లి ఒక సమావేశంలో మాచర్ల పట్టణానికి చెందిన ఎనిమిది [more]

Update: 2020-03-29 03:56 GMT

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 17న ఢిల్లీకి వెళ్లి ఒక సమావేశంలో మాచర్ల పట్టణానికి చెందిన ఎనిమిది మంది పాల్గొన్నారు. వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఎనిమిది మంది బంధువులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే వీరిలో రోగి బంధువుల కొందరు క్వారంటైన్ రాబోమని మొండికేశారు. దీంతో వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపర్చిన పోలీసులు ఎట్టకేలకు క్వారంటైన్ కు తరలించారు.

Tags:    

Similar News