జనసేనలో మొదలైన పొత్తు చర్చలు

జనసేన – వాపక్ష పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో జనసేన [more]

Update: 2019-01-08 07:46 GMT

జనసేన – వాపక్ష పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో జనసేన కార్యాలయానికి వచ్చి మొదట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. అనంతరం వారిని తీసుకెళ్లి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తమకు పట్టున్న కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సీట్ల జాబితాను సీపీఐ, సీపీఎం నేతలు పవన్ కళ్యాణ్ కి అందించారు. పొత్తులు, సీట్ల కేటాయింపుపై చర్చలు జరిపామని, సంక్రాంతి తర్వామ మరోసారి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతామని సీపీఐ, సీపీఎం నేతలు తెలిపారు.

Tags:    

Similar News