బ్రేకింగ్ : భారత్ లో ఆరు లక్షల మార్క్ దాటిన కేసులు

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షలు దాటేశాయి. తాజాగా పెరిగిన కేసులతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05, 020 కు [more]

Update: 2020-07-02 03:41 GMT

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షలు దాటేశాయి. తాజాగా పెరిగిన కేసులతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05, 020 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 17,848 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 2.21 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు 3.80 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ముంబయి, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News