కుర్చీ కోసం కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

కాంగ్రెస్ నేత‌ల కొట్లాట‌కు ఈసారి ఇందిరా పార్క్ వేదికైంది. త‌మ పార్టీ కార్య‌క్ర‌మం కాకున్నా ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు కుర్చీ కోసం కొట్లాడుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ ముఖ్య [more]

Update: 2019-05-11 06:59 GMT

కాంగ్రెస్ నేత‌ల కొట్లాట‌కు ఈసారి ఇందిరా పార్క్ వేదికైంది. త‌మ పార్టీ కార్య‌క్ర‌మం కాకున్నా ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు కుర్చీ కోసం కొట్లాడుకున్నారు. ఏకంగా కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో పాటు అన్ని పార్టీ వారి ముందే ఒక‌రోపై ఒక‌రు దాడి చేసుకున్నారు. ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై శ‌నివారం ఇందిరా పార్క్ వ‌ద్ద అఖిల‌ప‌క్ష ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి అన్ని పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. వేదిక‌పై వి.హ‌నుమంత‌రావు కుర్చీని కాంగ్రెస్ నేత న‌గేశ్ ఆ పార్టీ ఇంఛార్జి కుంతియాకు ఇచ్చారు. దీంతో త‌న కుర్చీని ఎందుకు తీసుకున్నావంటూ వీహెచ్ రెచ్చిపోయారు. న‌గేశ్ పై దాడి చేశారు. న‌గేశ్ సైతం వీహెచ్ ను తోశారు. అయితే, మీరు గాంధీ భ‌వ‌న్ లో కొట్టుకోవాల‌ని, ఈ వేదిక‌పై ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని మిగ‌తా పార్టీల నేత‌లు కాంగ్రెస్ నేత‌ల వైఖ‌రి ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News