సీఎం రమేష్ వాగ్వాదం… వెనుదిరిగిన ఐటీ అధికారులు

తెలుగుదేశం పార్టీ మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి వద్ద టీడీపీ నేతలు హల్ చల్ చేశారు. ఇవాళ పొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఇన్ [more]

Update: 2019-04-03 13:51 GMT

తెలుగుదేశం పార్టీ మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి వద్ద టీడీపీ నేతలు హల్ చల్ చేశారు. ఇవాళ పొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేయడానికి వచ్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చాక ఆయన సమక్షంలో సోదాలు జరపాలి. కానీ, ఆయన రాకుండా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వచ్చారు. ఆయన ఏకంగా ఐటీ అధికారుల వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. కక్షపూరితంగా టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో వాదించారు. ఇక్కడ ఏం దొరికాయో మీడియాతో మాట్లాడాలని వారిని డిమాండ్ చేశారు. అయితే, తమ నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడవద్దని ఐటీ అధికారులు సమాధానం ఇచ్చారు. సీఎం రమేష్ వాగ్వాదానికి దిగడం, టీడీపీ కార్యకర్తలు గుమిగూడటంతో చేసేదేమీ లేక ఐటీ అధికారులు వెనుదిరిగారు. ఈ విషయాన్ని ఐటీ అధికారులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Tags:    

Similar News