అరాచకాలకు అంతే లేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతేలేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మూడున్నరనెలల్లోనే వైసీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు గుంటూరు జిల్లా నేతలతో [more]

Update: 2019-09-03 05:21 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతేలేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మూడున్నరనెలల్లోనే వైసీపీ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు గుంటూరు జిల్లా నేతలతో కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. మూడున్నర నెలలో హత్యలు, ఆత్మహత్యలు, సామూహిక దాడులు, వేధింపులు, అక్రమకేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ బాధితులకు టీడీపీ అండగా నిలబడుతుందన్నారు. అందుకోసమే గుంటూరులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు నిన్సహాయులుగా మారారని చెప్పారు. టీడీపీ నేతలు క్యాడర్ కు అండగా నిలవాలని కోరారు.

Tags:    

Similar News