వారి అండతో జగన్ రెచ్చిపోతున్నారు

నరేంద్ర మోడీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ పోలీసులతో కలిసి [more]

Update: 2019-03-07 06:08 GMT

నరేంద్ర మోడీ, కేసీఆర్ అండతో జగన్ రెచ్చిపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ పోలీసులతో కలిసి వైసీపీ నేతలు టీడీపీ డేటాను దొంగలించి టీడీపీ నేతలకే ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి ఫోన్లు చేసే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. మోసాలు, నేరాలు వైసీపీ పుట్టకలోనే ఉన్నాయన్నారు. జగన్ మాయా రాజకీయం మన రాష్ట్రంలో చెల్లదని అన్నారు. వైసీపీ అడ్డదారులు, తప్పుడు విధానాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో వైసీపీని దోషిగా నిలబెట్టాలని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, సేవామిత్రల సమాచారం దొంగలించడం దుర్మార్గమన్నారు. టీడీపీపై ప్రత్యర్థులు దాడులు పెంచేశారని, ఈ సమయంలో బేషజాలు వదిలేసి ఐక్యంగా పనిచేయాలి సూచించారు. న్యాయం తమ వైపే ఉంటుందని, అంతిమ విజయం ధర్మానిదే అని స్పష్టం చేవారు.

Tags:    

Similar News