బాబు ట్వీట్..జగన్ పైనే

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంలో జర్నలిస్ట్ [more]

Update: 2019-09-24 08:37 GMT

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంలో జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతల దాడులను చంద్రబాబు ఖండించారు. జగన్ ప్రభుత్వం నిరంకుశ రాజ్యంగా మారిందన్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News