బ్రేకింగ్ : చంద్రబాబు దీక్షకు షాక్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 14వ తేదీన చంద్రబాబు విజయవాడలో దీక్ష చేయాలనుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ [more]

Update: 2019-11-08 08:01 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 14వ తేదీన చంద్రబాబు విజయవాడలో దీక్ష చేయాలనుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ధర్నా చేయాలని నిర్ణయించారు.అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చంద్రబాబు దీక్షకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహిస్తారని, ప్రయివేటు కార్యక్రమాలకు అనుమతివ్వబోమని అధికారులు తేల్చి చెప్పారు. ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు ఈనెల 14 వతేదీ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేయడానికి అనుమతి నిరాకరించడంతో ప్రత్యామ్నాయ స్థలాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. బహుశ ధర్నా చౌక్ లో చంద్రబాబు దీక్ష చేసే అవకాశముంది.

Tags:    

Similar News