బాబు సారీ చెప్పారు.. ఇక చేయబోనన్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పశ్చాత్తాపం పడుతున్నారు. ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, క్యాడర్ ను పట్టించుకోలేదన్నారు. [more]

Update: 2020-09-05 03:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పశ్చాత్తాపం పడుతున్నారు. ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీని, క్యాడర్ ను పట్టించుకోలేదన్నారు. ఇది తాను చేసిన తప్పుగా చంద్రబాబు అంగీకరించారు. భవిష్యత్ లో ఇలాంటి తప్పు ఎన్నడూ చేయనని నేతలకు మాట ఇచ్చారు. ఇప్పుడు కలసి కట్టుగా ఉండి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడి వారికి అండగా నిలవాలని, కార్యకర్తలకు ఎంత కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News