మోదీకి చంద్రబాబు మరో లేఖ… మీ చర్యలు ప్రశంసనీయమే కానీ?

ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. భవిష్యత్ [more]

Update: 2020-05-09 03:57 GMT

ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. భవిష్యత్ లో ప్రజల ఆరోగ్యం ప్రభావం చూపుతుందన్న ఆందోళన చంద్రబాబు లేఖలో వ్యక్తం చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ సంఘటనపై మీరు చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. మీరు సకాలంలో స్పందంచబట్టే విషవాయువు అదుపులోకి వచ్చిందని తెలిపారు. నీరి నిపుణుల అభిప్రాయం మేరకు ఈ విషవాయువులో స్టెరిన్ తో పాటు మరికొన్ని విషవాయువులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అంతర్జాతీయ నిపుణులతో లోతుగా దర్యాప్తు జరపాలని చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో కోరారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రం మరింత లోతైన దర్యాప్తు చేయాలని ఆయన తన లేఖలో అభ్యర్థించారు.

Tags:    

Similar News