వారిపై చర్యలు తీసుకోండి… మా వాళ్లను మాత్రమే?

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా రైతు సమస్యలను [more]

Update: 2020-04-07 12:42 GMT

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా రైతు సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యేలనుపోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం యధేచ్ఛగా రోడ్ల మీదకు అనుమతిస్తున్నారని, ఈ వివక్షను తొలగించాలని చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

Tags:    

Similar News