బాబు రెండో రోజు మాత్రం?

టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిన్న తొలి రోజు పర్యటనలో వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు [more]

Update: 2020-02-25 03:04 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిన్న తొలి రోజు పర్యటనలో వైసీపీ నేతలు అమరావతికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. చంద్రబాబు యాత్రలో ఈ నిరసనలు చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రెండో రోజు చంద్రబాబు పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు చంద్రబాబు దండికుప్పం, గోవినపల్లె, విజలాపురం, కంగుంది గ్రామాల్లో పర్యటిస్తారు. ప్రజా చైతన్య యాత్రలో పాల్గొంటారు. టీడీపీ నేతల సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News