టెన్షన్ లో చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ టెన్షన్ పడుతోంది. దీంతో ఆయన హైదరాబాద్ కు చేరుకుని ఆడిటర్లు, న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో [more]

Update: 2020-02-14 06:06 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ టెన్షన్ పడుతోంది. దీంతో ఆయన హైదరాబాద్ కు చేరుకుని ఆడిటర్లు, న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ తో పాటు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఐటీ శాఖ జరిపిన దాడిలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపినట్లు ప్రకటించింది. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి కంపెనీల్లో కూడా దాడులు చేసింది. అయితే చంద్రబాబు ప్రతి శుక్రవారం రాత్రి బయలుదేరి హైదరాబాద్ చేరుకుని శని, ఆదివారాలు ఉంటారు. ఇక్కడ కుటుంబంతో గడుపుతారు. అయితే ఐటీ దాడుల నేపథ్యంలో ముందుగానే చంద్రబాబు హైదరాబాద్ చేరుకోవడం చర్చనీయాంశమయింది.

Tags:    

Similar News