ఖండిస్తున్నా… గర్హిస్తున్నా…హెచ్చరిస్తున్నా

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 33రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర [more]

Update: 2020-01-20 05:33 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 33రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంత మంది పోలీసుల్ని మోహరించలేదన్నారు. అన్ని జిల్లాల్లో కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారని, పిరికి పందల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ రోజు బ్లాక్ డే అని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని, ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Tags:    

Similar News