వంశీని ఎలా గుర్తిస్తారు?

వల్లభనేని వంశీని తమ పార్టీ సస్పెండ్ చేసిందని, సస్పెండ్ చేసిన సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్ ప్రవర్తన బాగా [more]

Update: 2019-12-11 12:46 GMT

వల్లభనేని వంశీని తమ పార్టీ సస్పెండ్ చేసిందని, సస్పెండ్ చేసిన సభ్యుడిని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్ ప్రవర్తన బాగా లేదన్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. తన జీవితంలో ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను మర్యాదను కాపాడండి అని మాత్రమే కోరానని తెలిపారు. స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. గతంలో ఏ శాసనభలోనూ ఇలా చూడలేదన్నారు. ప్రభుత్వం పాలన చేయాలని, ప్రతిపక్షం ప్రశ్నించాలన్న విషయం స్పీకర్ కు తెలియదా? అని ప్రశ్నించారు. వల్లభనేని వంశీకి ప్రత్యేక సభ్యుడిగా గుర్తించే అధికారం స్పీకర్ కు ఎక్కడదన్నారు. స్పీకర్ ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు చాలా దారుణమన్నారు. జగన్ పేదల నడ్డివిరచడానికే ఆర్టీసీ ఛార్జీలను పెంచారన్నారు.

Tags:    

Similar News