ఉద్వేగానికిలోనయిన బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతానికి ఆయన నమస్కరించారు. తాను ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తానని చెప్పారు. ఉద్దండరాయుని పాలెం [more]

Update: 2019-11-28 07:37 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతానికి ఆయన నమస్కరించారు. తాను ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తానని చెప్పారు. ఉద్దండరాయుని పాలెం వద్ద మోడీ, చంద్రబాబులు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన చంద్రబాబు కొంత ఉద్వేగానికి లోనయ్యారు. భావోద్వేగానికి గురైన చంద్రబాబు భూమికి తలను తాకించి నమస్కరించారు. తనను చూసి రైతులు 33 వేల ఎకరాలను పూలింగ్ కింద ఇచ్చారని, ఈప్రాంతాన్ని వైసీపీ నేతలు స్మశానంతో పోలుస్తున్నారని ఆవేదన చెందారు. వివిధ ప్రాంతాలనుంచి రాజధాని నిర్మాణం కోసం సేకరించిన మట్టిని కూడా తాకి ఆయన ఉద్విగ్నానికి లోనయ్యారు.

Tags:    

Similar News