ఖచ్చితంగా మళ్లీ అధికారం మనదే

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు రెండోరోజు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరన్నారు. ఎవరికీ [more]

Update: 2020-05-28 07:14 GMT

తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు రెండోరోజు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరన్నారు. ఎవరికీ టీడీపీ భయపడబోదని చెప్పారు. సవాళ్లు టీడీపీకి కొత్త కాదని, తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి అండ అని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News