విశాఖ వద్దామనుకున్నా… కుదరడం లేదు

మహానాడులో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే విశాఖ వద్దామనుకున్నానని చంద్రబాబు చెప్పారు. [more]

Update: 2020-05-27 06:56 GMT

మహానాడులో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే విశాఖ వద్దామనుకున్నానని చంద్రబాబు చెప్పారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతిని కోరినా లభించలేదన్నారు. లాక్ డౌన్ నిబంధనల దృష్ట్యా తాను విశాఖ రాలేకపోయానని చంద్రబాబు చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకూ గ్యాస్ లీక్ పై శాస్త్రీయ అధ్యయనం జరగలేదన్నారు. బాధితుల పక్షాన అండగా నిలిచిన వారిపై కేేసులు నమోదు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. మృతుల కుటుంబాలకు తాము యాభై వేల సాయాన్ని ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News