ఎన్నికలను అందుకే బహిష్కరిస్తున్నాం.. కఠిన నిర్ణయమే అయినా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పొలిట్ బ్యూరో కూడా ఇదే నిర్ణయించిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల [more]

Update: 2021-04-02 12:39 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పొలిట్ బ్యూరో కూడా ఇదే నిర్ణయించిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినా తప్పదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలంటే తమకు భయలేదని, ప్రజా కోర్టులో వైసీపీని దోషిగా పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవే లో ఎలా ఎన్నికలు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్ ఇస్తే తాము ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News