అన్ని చోట్ల నామినేషన్లు పడాల్సిందే

అన్ని చోట్ల నామినేషన్లను వేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుడంటంతో [more]

Update: 2021-01-29 01:53 GMT

అన్ని చోట్ల నామినేషన్లను వేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానుడంటంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ నేతలతో మాట్లాడారు. ప్రతి పంచాయతీలో నామినేషన్ పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా, వైసీపీ బెదిరింపులకు పాల్పడినా వెంటనే కేంద్ర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. ఏకగ్రీవంగా జరగకుండా నామినేషన్లు పడేలా బాధ్యులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

Tags:    

Similar News