బాబు ఏం ట్వీట్ చేశారంట..?

Update: 2018-12-04 06:29 GMT

కేంద్రం అన్యాయం చేసినా తెలుగు జాతిగా కలిసి పనిచేద్దాం అంటే కేసీఆర్ కలిసి రాలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేతచంద్రబాబునాయుడు. ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. కేసీఆర్ మోదీతో కలిసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క మంచి పని చేయలేక, ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అన్ని వనరులున్నా సమర్థవంతమైన నాయకత్వం లేక తెలంగాణ రాష్ట్రం నేడు సమస్యలు ఎదుర్కొంటోందని చంద్రబాబు అభిప్రాయడ్డారు.

టీఆర్ఎస్ కు బుద్ధిచెప్పాలి....

అందుకే టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలనే ప్రజాకూటమికి తాము మద్దతిస్తున్నామనిచెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ పల్లకీ మోస్తున్నారంటే.. కారణం కేవలం ప్రజలేనని అన్నారు చంద్రబాబు. పదవులు ఆశించకుండా ప్రజలకు మేలు జరగాలని కార్యకర్తలు శ్రమిస్తుండటాన్ని ఆయన అభినందించారు. కూటమి గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Similar News