నా ఇంటి గురించి బెంగ వద్దు

ప్రభుత్వం సృష్టించిన వరదగానే చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరామర్శించారు. తన ఇంటికేం కాదని, తన ఇంటి [more]

Update: 2019-08-20 08:48 GMT

ప్రభుత్వం సృష్టించిన వరదగానే చూడాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరామర్శించారు. తన ఇంటికేం కాదని, తన ఇంటి గురించి వైసీపీ నేతలకు ఎందుకు బెంగ అని ప్రశ్నించారు. వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుందన్నారు. వరద వస్తుందని తెలిసినా, సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ఇసుకను ఇవ్వలేరు.. నిర్మాణాలు మొదలు కావని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News