ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అట….!!!

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు నరేంద్ర మోదీ మేలు కోసమే రాజీనామా చేశారని, ప్రత్యేక హోదాపై వారికి చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన [more]

Update: 2019-03-21 06:14 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు నరేంద్ర మోదీ మేలు కోసమే రాజీనామా చేశారని, ప్రత్యేక హోదాపై వారికి చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… మోదీని అవిశ్వాసంలో గెలిపించడానికే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని అన్నారు. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని వైసీపీ ఎంపీ అభ్యర్థులే ఉంటున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అసాధ్యమని చెప్పిన జగన్ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ కుట్ర చేసిందని, జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతేలేదన్నారు. పులివెందులలో వైఎస్ వివేకా హత్యపై డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News