ఆ నలుగురు ఒక్కటయ్యారు… ఖబడ్దార్..!

24 బాంబులేస్తేనే తాను భయపడలేదని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడనని, తనను భయపెట్టాలనుకుంటున్న వారి గుండెల్లో నిద్రపోతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా [more]

Update: 2019-03-02 12:05 GMT

24 బాంబులేస్తేనే తాను భయపడలేదని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడనని, తనను భయపెట్టాలనుకుంటున్న వారి గుండెల్లో నిద్రపోతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడమూరులో జరిగిన కోట్ల కుటుంబం చేరిక సభలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రానికి నరేంద్ర మోడీ అన్యాయం చేశారని, విభజన హామీలు అమలు చేయలేదన్నారు. అయినా మోడీని జగన్ అడగడం లేదని పేర్కొన్నారు. జగన్ కు ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్లే అన్న విషయాన్ని ముస్లింలు గుర్తించాలని అన్నారు. ముస్లిం సోదరులకు అన్యాయం జరగకుండా వారికి తాను అండగా ఉంటానన్నారు.

అభినందన్ కు స్వాగతం పలకలేదు…

నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్, అసదుద్దిన్ ఓవైసీ ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని అన్నారు. వాళ్ల రాజకీయాలు ఉంటే తెలంగాణలో చేసుకోవాలని, ఆంధ్రలో చేయాలనుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తన దగ్గర పెరిగిన కేసీఆర్ తనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అంటున్నారని ఆరోపించారు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తే ఉపేక్షించమన్నారు. యుద్ధాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మోడీ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు యుద్ధం చేస్తే ఓట్లు రావని, ప్రజలను కాపాడితే, ప్రజల కోసం పనిచేస్తే ఓట్లు వస్తాయన్నారు. అభినందన్ కు మోడీ స్వాగతం పలికి ఉంటే తాను కూడా అభినందించే వారినన్నారు

Tags:    

Similar News