టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

మళ్లీ తెలుగుదేశం గెలిస్తేనే అభివృద్ధి జరుగుతందని, చిన్న పొరపాటు జరిగి అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో సమస్యలు మళ్లీ మొదటికి వస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]

Update: 2019-01-25 13:54 GMT

మళ్లీ తెలుగుదేశం గెలిస్తేనే అభివృద్ధి జరుగుతందని, చిన్న పొరపాటు జరిగి అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో సమస్యలు మళ్లీ మొదటికి వస్తాయని, అభివృద్ధి ఆగిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం డ్వాక్రా మహిళలతో సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలు, 150కి పైగా అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరమన్నారు. మరో పదేళ్లు అందరం కలిసి పనిచేస్తే దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి చేరుతుందన్నారు. తనకు డ్వాక్రా మహిళల రూపంలో 94 లక్షల మంది చెల్లెమ్మలు ఉన్నారని, ఇంతకంటే ఎక్కువ తనకేం కావాలన్నారు. తెలంగాణ నాయకుడు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, వాళ్ల ఆటలు సాగనివ్వనని అన్నారు. తెలుగుదేశం హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందిందని, చెందుతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News