చంద్రబాబు ప్రచారం చేసిన చోట...??

Update: 2018-12-11 08:29 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పరాభవం తప్పలేదు. ఆయన తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాకూటమి ఏర్పాటుతో పాటు టిక్కెట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక అంశాల్లో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఇక తెలంగాణలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. ఆయన ప్రచారం చేసిన స్థానాల్లో కేవలం సత్తుపల్లి, అశ్వరావుపేట మినహా అన్ని స్థానాల్లో ప్రజాకూటమి అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.

అన్ని స్థానాల్లోనూ ఓటమి

ఖమ్మంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్నారు. చరిత్రాత్మకంగా చెప్పుకున్న ఈ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇక ఆయన హైదరాబాద్ లో కూకట్ పల్లి, ఉప్పల్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మలక్ పేట్ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోల ద్వారా ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ అన్ని స్థానాల్లోనూ ప్రజాకూటమి అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

Similar News