ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటించనున్నాయి. మొత్తం మూడు బృందాలు వరద [more]

Update: 2020-11-09 01:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పర్యటించనున్నాయి. మొత్తం మూడు బృందాలు వరద నష్టాన్ని అంచనా వేయనున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తక్షణ సాయాన్ని ప్రకటించాలని కోరారు. వరద నష్టం అంచనా వేసేందుకు నేడు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు.

Tags:    

Similar News