15 లక్షలు వస్తాయి... కానీ టైం పడుతుంది

Update: 2018-12-19 07:37 GMT

గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్ లో రూ.15 లక్షలు’ హామీ పట్ల కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్ దాస్ అథావాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ... ‘‘రూ.15 లక్షలు ఒకేసారి రావు. మెళ్లిగా ఆ డబ్బులు వస్తాయి. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదు. ఆర్బీఐని డబ్బుల కోసం అడిగితే... వారు ఇబ్బడం లేదు. ఇస్తామని చెబుతున్నారు కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతున్నారు. కానీ, నరేంద్ర మోదీ ప్రధానిగా దేశప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మాత్రం పరిష్కరించారు.’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇటీవలి ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా తాము కాంగ్రెస్ ని ఓడిస్తామని ప్రకటించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు.

Similar News