దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని?

దశల వారీగా లాక్ డౌన్ దేశంలో ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే 3వ తేదీతో లాక్ డౌన్ రెండో విడత ముగుస్తుంది. భారత్ లో లాక్ [more]

Update: 2020-04-27 01:46 GMT

దశల వారీగా లాక్ డౌన్ దేశంలో ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే 3వ తేదీతో లాక్ డౌన్ రెండో విడత ముగుస్తుంది. భారత్ లో లాక్ డౌన్ విధించి నలభై రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్, హాట్స్ స్పాట్ లలో లాక్ డౌన్ ను కొనసాగించి మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చే విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతున్నాయి. ఈరోజు జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News