బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులను వారి స్వగ్రామాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని [more]

Update: 2020-05-01 03:44 GMT

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులను వారి స్వగ్రామాలకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు నుంచి వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన సూచనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తలసానితో ఫోన్ లో మాట్లాడారు. వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలన్న తలసాని సూచన బాగుందని కిషన్ రెడ్డి ప్రశంసించారు. మంత్రివర్గంతో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News