ముగిసిన బొల్లినేని కస్టడీ.. పెదవి విప్పని గాంధీ

మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సీబీఐ కస్టడీ ముగిసింది. నాలుగురోజుల పాటు సీీీబీఐ అధికారులు ఆయనను విచారించారు. అయితే ఆయన మాత్రం పెదవి విప్పలేదని [more]

Update: 2021-05-05 01:05 GMT

మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ సీబీఐ కస్టడీ ముగిసింది. నాలుగురోజుల పాటు సీీీబీఐ అధికారులు ఆయనను విచారించారు. అయితే ఆయన మాత్రం పెదవి విప్పలేదని తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. అయితే ఆయన ఆదాయానికి మించిన ఆస్తులపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో బొల్లినేని శ్రీనివాస్ గాంధీకి ఆస్తులున్నాయి. ఈ ఆస్తులపై సీబీఐ అధికారులు ఎంత ప్రశ్నించినా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News