అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి ఎప్పుడూ మారదని చెప్పారు. నాలుగు సంవత్సరాల నుంచి [more]

Update: 2021-03-09 01:23 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి ఎప్పుడూ మారదని చెప్పారు. నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ యోచన జరుగుతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రధానికి జగన్ లేఖ రాసిన విషయాన్ని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అంకురార్పణ జరిగిందని బొత్స తెలిపారు.

Tags:    

Similar News